ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణబలరాములఁ గాంచి పౌరులు శోకించుట
“లక్కటా! ఈ కంసుఁ డతి పాపకర్ముఁ
డెక్కడి యీ బాలురెక్కడి వీర
లెక్కడననిఁ జూడకెట్లుగావించె
నక్కటా! వారించరైరి యెవ్వరును
ఈ సుకుమారుల నిటుసేయఁ దనకు
దోసంబుఁ దిట్టును దూరును గాదె?
పరుషత రిపులతో బవరంబు సేయ
హరిమేను ఘర్మకణాంచితంబగుచు
వివశితాంభోజంబువిధ మొందెఁ జూడుiv
డీ వాసుదేవులకీబారిగడవు
దైవమా” యని మ్రొక్కి తరుణులు వగువ;
దేవకియును వసుదేవుఁడుఁ భ్రీతి
గోవిందబలులఁ గనుంగొని వంతనొంది